News February 3, 2025

మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP

image

రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.

Similar News

News March 5, 2026

మన అతిథులపై దాడి చేశారు: ఒమర్ అబ్దుల్లా

image

హిందూ మహాసముద్రంలో <<19299071>>ఇరాన్ నౌక<<>>పై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇండియాలో నేవీ విన్యాసాల అనంతరం వెళ్తున్న షిప్‌పై దాడి చేశారు. వాళ్లు మన అతిథులు. ఈ వ్యవహారంలో మన దేశాన్నీ లాగుతున్నారు’ అని చెప్పారు. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారని, వాళ్లను సహించబోమని హెచ్చరించారు.

News March 5, 2026

కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

image

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

News March 5, 2026

NGKL: ‘మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి’

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు.