News February 3, 2025
U19 WC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. లిస్టులో నలుగురు భారత ప్లేయర్లు
U19 మహిళల WCలో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ చోటు దక్కించుకున్నారు.
జట్టు: త్రిష, బోథా(SA), పెర్రిన్(ENG), కమలిని, కావోయిహ్మ్ బ్రే(AUS), పూజా మహతో(NEP), కైలా రేనెకే(కెప్టెన్-SA), కేటీ జోన్స్(ENG), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద(SL), వైష్ణవి శర్మ, తాబిసెంగ్(SA).
Similar News
News February 4, 2025
ఆస్తులపై పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం: కేంద్ర హోంశాఖ
విభజన సమస్యలను తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై AP, TG అధికారులతో ఆయన చర్చించారు. ఆస్తులు తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు సమాచారం.
News February 4, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుజనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యలేని నీచుడి దగ్గరకు వెళ్లకూడదు. వాటి వల్ల ప్రమాదం ఉంటుంది.
News February 4, 2025
అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్
AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.