News March 19, 2024

అకాల వర్షాలు.. రైతన్న కష్టం నీటిపాలు!

image

TG: అకాల వర్షాలు అన్నదాత కష్టాన్ని నీటిపాలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అంచనా. ఒక్క కామారెడ్డిలోనే 21వేల ఎకరాల పంట దెబ్బతింది. వరి, జొన్న, మిర్చి, పొగాకు, శనగ వంటి పంటల నష్టంతో పాటు మామిడి, చింత చెట్ల పూత, కాయలు సైతం రాలిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News April 2, 2025

ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

image

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

News April 2, 2025

కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

image

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.

News April 2, 2025

ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

image

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్‌తో తాత్కాలిక టెంట్‌ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!