News February 4, 2025

కామారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు సొన్నైల తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 19, 2026

మంచిర్యాల: తండ్రి మందలించాడని వర్షిత సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత(17) తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కేసు నమోదైంది.

News March 19, 2026

మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

image

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.

News March 19, 2026

MBNR: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

image

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,288 అంత్యోదయ కార్డులు, 10,24,472 ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.