News February 4, 2025
మేడ్చల్ జిల్లాలో రూ.29.56 కోట్ల రుణమాఫీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ఇప్పటి వరకు 4,371 మంది రైతులకు రూ.29.56 కోట్ల వరకు మేలు జరిగినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలను అమలు చేసేందుకు పకడ్బండిగా చర్యలు చేపడుతున్నట్లుగా మేడ్చల్ కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

* BP, డయాబెటిస్ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
News January 18, 2026
మేడారం వేదికగా కేబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ అయింది. మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన, యాసంగి రైతు భరోసా, మున్సిపల్ ఎన్నికలు వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మేడారం జాతరకు జాతీయ హోదా సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది.
News January 18, 2026
డ్రంక్ అండ్ డ్రైవ్పై జగిత్యాల జిల్లా పోలీసుల కఠిన చర్యలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. Arrive Alive రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు Drunk and Drive – Zero Tolerance Day నిర్వహించారు. పోలీసులు బ్రెత్ అనలైజర్లతో వాహనదారులను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.


