News February 4, 2025
మేడ్చల్ జిల్లాలో రూ.29.56 కోట్ల రుణమాఫీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ఇప్పటి వరకు 4,371 మంది రైతులకు రూ.29.56 కోట్ల వరకు మేలు జరిగినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలను అమలు చేసేందుకు పకడ్బండిగా చర్యలు చేపడుతున్నట్లుగా మేడ్చల్ కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
విశాఖ సీపీ కార్యాలయంలో రికవరీ మేళా

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం రికవరీ మేళా నిర్వహించారు. డిసెంబర్ నెలలో మొత్తం 77 కేసులలో 44 కేసులు చేధించి 42 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.1,07,17,800 స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు అందించారు. ఇందులో 294.155 గ్రాముల బంగారం, 301.58 గ్రాముల వెండి, రూ.1,72,500, 15 మోటార్ సైకిల్లు, ఒక ఆటో, 340 మొబైల్ ఫోన్స్, 12 ఆటో బ్యాటరీలు, ఒక బస్సు, 2 మెట్రిక్ టన్నుల కోల్ ఉన్నాయి.
News January 24, 2026
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ICC చేర్చినట్లు క్రిక్బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.
News January 24, 2026
సిరిసిల్ల: ఖననం చేసిన 24 రోజులకు పోస్టుమార్టం.. కారణం ఇదే!

మృతదేహం పాతిపెట్టిన 25 రోజులకు పోస్టుమార్టం చేసిన ఘటన పోచెట్టిపల్లిలో చోటు చేసుకుంది. పూడూరి ఎల్లయ్య (61) డిసెంబర్ 18న కారు ఢీకొని చికిత్స పొందుతూ 31న మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి చికిత్స చేయించడంతో మృతదేహాన్ని ఖననం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము, కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం పోస్టుమార్టం రిపోర్టు అవసరమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేశారు.


