News February 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

image

ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రి సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11 పరిశీలన, ఫిబ్రవరి 13 ఉపసంహరణ, ఫిబ్రవరి 27 పోలింగ్ ఉంటుందన్నారు.

Similar News

News March 13, 2026

15ఏళ్లలో లేనంతగా క్రాష్.. $533 బిలియన్ల నష్టం!

image

సెన్సెక్స్ ఈరోజు 878 పాయింట్ల నష్టంతో 75,174.. నిఫ్టీ 299 Pts నష్టంతో 23,339 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో ₹489L Crగా ఉన్న భారత మార్కెట్ క్యాప్ ₹440L Crకు తగ్గింది. 2011లో $625B కోల్పోగా ఈ ఏడాది మూడు నెలల్లోనే ఆ స్థాయి పతనం నమోదైంది. ఈ నష్టం మెక్సికో, మలేషియా, నార్వే, ఖతర్, వియత్నాం వంటి దేశాల Mcap కంటే ఎక్కువ. FII సెల్లింగ్, ట్రేడ్ టెన్షన్స్, యుద్ధాలు ఇందుకు కారణం.

News March 13, 2026

చిత్తూరు జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం ఇదే!

image

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్వెల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని DEO హెచ్చరించారు.

News March 13, 2026

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.