News February 4, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

పెద్దపల్లి: విధుల్లో నిర్లక్ష్యం.. రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్

image

పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్‌ను విధులలో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడం వంటి అంశాలపై పలు మార్లు మెమోలు, షోకాజ్ నోటీసులు ఇచ్చినా మార్పు రాకపోవడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News January 8, 2026

నెల్లూరు: రూ.14.22 కోట్లను ప్రభుత్వం రాబట్టలేదా..?

image

నెల్లూరు జిల్లాలో గనుల తవ్వకాల పన్ను(సీనరేజ్) వసూళ్ల కాంట్రాక్టర్‌ను AMR సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ.14.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎక్కడికక్కడ AMR చెక్‌పోస్ట్‌లు పెట్టి రూ.30కోట్లకు పైగా వసూళ్లు చేస్తోందని సమాచారం. కానీ ప్రతినెలా ప్రభుత్వానికి సరిగా సీనరేజ్ కట్టడం లేదని తెలుస్తోంది. జనవరి ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉందని DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు.

News January 8, 2026

పెద్దపల్లిలో 123 సీనియర్ సిటిజన్ కేసులకు పరిష్కారం

image

PDPL జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన 123 సీనియర్ సిటిజన్ ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మొత్తం 152 ఫిర్యాదులు నమోదు కాగా 29 కేసులు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని స్పష్టం చేశారు. వయోవృద్ధులు ముందుగా సంబంధిత ఆర్డీఓ వద్ద ఫిర్యాదు నమోదు చేయాలని, అక్కడ పరిష్కారం కానీ పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.