News February 4, 2025
EEMT మెరిట్ టెస్ట్ ఫలితాల ప్రకటన

EEMT – 2025 ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 94 మంది 7,10 తరగతుల విద్యార్థులకు రూ 5,03,000లక్షల నగదు బహుమతులను ఈ నెల 28న పంపిణీ చేయనున్నారు. అద్దంకికి సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
నరసరావుపేట: ‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 15న కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 14, 2025
రాజోలి: కరెంట్ షాక్తో యువకుడి మృతి

రాజోలి మండల కేంద్రానికి చెందిన సుజాత సోమేశ్వర్ రెడ్డి కుమారుడైన శివారెడ్డి (25) వరి పొలంలో ఉన్న బోరు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్తో ఆదివారం మృతి చెందాడు. పొలం పక్కన ఉన్న యువకుడు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానిక పిహెచ్సి కేంద్రానికి వెళ్లగా సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. శివారెడ్డికి ఇటీవలే కొడుకు పుట్టాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News September 14, 2025
టాస్ గెలిచిన భారత్

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్