News February 4, 2025

ASF: వన్యప్రాణులను వేటాడే మఠాను పట్టుకున్న ఆర్పీఎఫ్

image

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో పలువురు అనుమానితులను రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ట్రైన్లో అనుమానాస్పదంగా కనబడ్డ వీరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వన్యప్రాణుల వేటకు వాడే ఆయుధాలు లభ్యమైనట్లు తెలిపారు. వీరితో పట్టణ పోలీసులు అటవీశాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News November 5, 2025

రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

image

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

News November 5, 2025

SRD: ఘోర రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి

image

కర్ణాటక రాష్ట్రం హోళికేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బుధవారం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

NTR: తలచుకుంటే తల్లడిల్లే బీభత్సం..!

image

నేడు ప్రపంచ సునామీ దినోత్సవం. అయితే 2004 డిసెంబర్ 26న బంగాళాఖాతంలో వచ్చిన సునామీ ఆంధ్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర గ్రామాలు అతలాకుతమయ్యాయి. ఈ సునామీ వల్ల మొత్తం 301 గ్రామాలు నష్టపోగా, 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు నెలల పాటు కొనసాగాయి.