News February 4, 2025

మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: అల్లూరి కలెక్టర్  

image

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ MLC, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర MLC ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి మార్చి 8 వరకు అల్లూరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దీంతో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో జరుగుతున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మార్చి 8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

image

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్‌షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.

News March 1, 2026

ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: భద్రాద్రి కలెక్టర్

image

సోమవారం(రేపు) కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలని అన్నారు.

News March 1, 2026

గోదావరిఖని నుంచి కన్యాకుమారికి RTC టూర్ ప్యాకేజీ

image

గోదావరిఖని నుంచి కన్యాకుమారి వరకు యాత్ర ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM నాగభూషణం తెలిపారు. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, ఫళని, పాతాళశెంబు (కరుంగళిమాల) మధురై, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి, జోగులాంబ శక్తిపీఠం లాంటి పుణ్యక్షేత్రాల దర్శనాలు ఉంటాయని తెలిపారు. పెద్దలకు రూ.9999గా, పిల్లలకు రూ.6500గా నిర్ణయించామన్నారు. వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 సంప్రదించాలన్నారు.