News February 4, 2025
ప్రజల సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, బాధ్యతగా పరిష్కరించాలన్నారు.
Similar News
News January 11, 2026
నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
News January 11, 2026
న్యాయం గొప్పదా? ధర్మం గొప్పదా?

సమాజానికి రెండూ అవసరమే. కానీ, న్యాయం కన్నా ధర్మమే గొప్పది, విస్తృతమైనది. ఇది మన అంతరాత్మ, నైతికతకు సంబంధించినది. ఓ వ్యక్తి తన బాధ్యత, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడమే ధర్మం. ఇదే శాశ్వత సత్యం. న్యాయం కేవలం చట్టబద్ధమైనది. సాక్ష్యాధారాల ఆధారంగా, క్రమశిక్షణ కోసం మనం ఏర్పరుచుకున్నది. న్యాయం పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ ధర్మం అలా కాదు. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే గొప్పది.
News January 11, 2026
NLG: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్, RRB ఇతర పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఉచిత రెసిడెన్షియల్, శిక్షణకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని, ఫిబ్రవరి 8న జరిగే పరీక్షలో పాల్గొనాలని కోరారు.


