News February 4, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, బాధ్యతగా పరిష్కరించాలన్నారు.

Similar News

News March 19, 2026

సంగారెడ్డి: కిడ్నాపర్‌లను రాళ్లతో కొట్టిన పిల్లలు

image

సంగారెడ్డి ద్వారకానగర్ మైదానంలో ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దుండగులు గురువారం విఫలయత్నం చేశారు. ఆటోలో వచ్చిన ముగ్గురు ఓ బాలుడిని బలవంతంగా ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా.. తోటి పిల్లలు భయపడకుండా వారిపై రాళ్లతో దాడికి దిగారు. పిల్లల అరుపులతో స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు ఆటోలో పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామని సీఐ రాము నాయుడు తెలిపారు.

News March 19, 2026

రేవంత్‌కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

image

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.

News March 19, 2026

బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర ట్వీట్

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్‌పై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు.. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం’ అని ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంపై అభిమానాన్ని బయటపెట్టారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.