News February 4, 2025

MNCL: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.

Similar News

News January 15, 2026

మమతకు షాక్.. I-PAC ఆఫీసు సోదాల కేసులో నోటీసులు

image

I-PAC ఆఫీసులో సోదాల కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ED విధుల్లో జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. CM మమత, రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. I-PAC ఆఫీస్‌లోని CCTV ఫుటేజీని భద్రపర్చాలని తెలిపింది. ED అధికారులపై నమోదైన FIRపై స్టే విధించింది.

News January 15, 2026

పిఠాపురంలో సినీ దర్శకుల సందడి

image

పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో సినీ దర్శకులు బుచ్చిబాబు, మారుతి సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిలో సెల్ఫీలు తీసుకున్నారు. గోదావరి జిల్లాల పండుగ వైభవాన్ని ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.

News January 15, 2026

నారా ఫ్యామిలీని చూశారా.. Photo Gallery

image

AP: సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ, రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజస్విని, నారా రోహిత్, సిరి తదితరులు పాల్గొన్నారు.