News February 4, 2025
అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్

AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.
Similar News
News November 9, 2025
ఇవన్నీ క్యాన్సర్ కారకాలే!

నిత్యం మనం ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. పదేపదే మరిగించే నూనె, ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్లు, క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న టీ కప్పులు వీటిలోకే వస్తాయంటున్నారు. ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, వాడిన నూనెను వాడకపోవడం వంటి వాటికి దూరంగా ఉంటే ఈ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు.
News November 9, 2025
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.
News November 8, 2025
ఆసీస్తో అయిపోయింది.. సౌతాఫ్రికాతో మొదలవుతుంది

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టూర్ నేటితో ముగిసింది. రేపు ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. ఈనెల 14(కోల్కతా) నుంచి సౌతాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 22న(గువాహటి)లో సెకండ్ టెస్ట్ జరగనుంది. తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. 30న తొలి, DEC 3న రెండో, 6న మూడో వన్డే ఆడతారు. అనంతరం 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 9న తొలి, 11న రెండో, 14న మూడో, 17న నాలుగో, 19న ఐదో టీ20 జరుగుతుంది.


