News February 4, 2025
కొండపాకలో సనీ నటుడు సుమన్
అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం గుండె సంబంధిత సమస్యలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంజీవని ఆసుపత్రి సేవలు అమోఘమని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం కొండపాకలోని సంజీవని ప్రశాంతి నికేతన్ శిశు హృదయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ను సుమన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో కలిసి ఆయన సందర్శించారు. గుండె సంబంధిత చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 4, 2025
NRPT: రాజస్థాన్కు చెందిన వ్యక్తి హత్య
నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News February 4, 2025
రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
News February 4, 2025
NRPT: రాజస్థాన్కు చెందిన వ్యక్తి హత్య
నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.