News February 4, 2025

KMR: ‘మత్స్యకారులందరరూ వివరాలను నమోదు చేసుకోవాలి’

image

కామారెడ్డి జిల్లాలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న మత్స్యకారులందరూ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన కింద CSC సెంటర్ లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత సమాచారంతో తమ కామన్ సర్వీస్ కేంద్రాలను సంప్రదించాలన్నారు.

Similar News

News March 25, 2026

జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

image

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

News March 25, 2026

విజయవాడలో ‘ఉగ్ర’ అనుమానితులుగా అరెస్టయింది వీరే

image

వించిపేటలో సోమవారం పోలీసులు ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అరెస్టైన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్‌ల ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. వీరిలో రహమతుల్లా ర్యాపిడో డ్రైవర్‌గా, సోహైల్ బిర్యానీ షాపులో, డానిష్ ఆటోనగర్‌లో పని చేస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు.

News March 25, 2026

శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

image

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.