News February 4, 2025

మార్చ్ 12న PGECET- 2025 నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ -2025 నోటిఫికేషన్‌ను మార్చు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. దీనిలో భాగంగా నేడు కమిటీ మీటింగ్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చ్ 17 నుంచి మే 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Similar News

News November 16, 2025

సిరిసిల్ల: టీకా కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ రజిత

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. రజిత శనివారం ఆకస్మికంగా అంబేద్కర్ నగర్, శాంతినగర్‌లలోని టీకా కేంద్రాలను తనిఖీ చేశారు. కోల్డ్ చెయిన్ నిల్వలు, రికార్డులు, ఐస్ ప్యాక్స్‌ను పరిశీలించి, సక్రమ నిర్వహణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ సకాలంలో టీకాలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ సంపత్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.

News November 16, 2025

ఎల్లారెడ్డిపేట: ‘పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.

News November 16, 2025

SRCL: ‘బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు సాగాలి’

image

సిరిసిల్ల: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శనివారం గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగర్వాల్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని ఆమె అన్నారు.