News February 4, 2025
KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.
Similar News
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
News November 9, 2025
నిట్ వరంగల్లో ఉచిత GATE శిక్షణకు దరఖాస్తులు

వరంగల్ నిట్లో ఉచిత GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కోచింగ్ అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేస్తూ 17 నవంబర్ 2025 నుంచి 9 జనవరి 2026 వరకు 8 వారాల పాటు కొనసాగుతుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 9, 2025
నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.


