News February 4, 2025
EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500
TG: <<15348696>>ఈఏసీసెట్కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.
Similar News
News February 4, 2025
రోడ్డు ప్రమాదంలో లేడీ ఎస్సై మృతి
TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నారు.
News February 4, 2025
తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్
AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News February 4, 2025
Stock Markets: తేడా 0.3 శాతమే
భారత స్టాక్మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.