News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News March 25, 2026
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.
News March 25, 2026
అమ్రాబాద్: లాంటానాతో ‘బ్లాక్ గోల్డ్’ ఉత్పత్తి!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఆక్రమణ మొక్క లాంటానాను ‘బయోచార్’గా మార్చే వినూత్న పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల అడవి రక్షణతో పాటు టన్నుకు రూ.7,000 ఆదాయం లభిస్తుందని ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఈ చర్యతో వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడటమే కాకుండా స్థానిక గిరిజనులకు ఉపాధి కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
News March 25, 2026
అమ్రాబాద్: లాంటానాతో ‘బ్లాక్ గోల్డ్’ ఉత్పత్తి!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఆక్రమణ మొక్క లాంటానాను ‘బయోచార్’గా మార్చే వినూత్న పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల అడవి రక్షణతో పాటు టన్నుకు రూ.7,000 ఆదాయం లభిస్తుందని ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఈ చర్యతో వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడటమే కాకుండా స్థానిక గిరిజనులకు ఉపాధి కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.


