News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Similar News

News March 21, 2026

HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

image

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యరెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యరెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 21, 2026

సీతక్కకు ‘ఉత్తమ సేవా పురస్కార్’ అవార్డు

image

రాష్ట్ర మంత్రి సీతక్క శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 24న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రధానం చేయనున్నారు. అవార్డు ఎంపికకు సంబంధించిన పత్రాన్ని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేష్ సీతక్కకు అందజేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు చేసిన సేవకు గానూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పారు.

News March 21, 2026

హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలి: ఎమ్మెల్యే పల్లా

image

జనగామ జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న ఇద్దరి జీవనాధారాన్ని తొలగించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. చదువు తక్కువగా ఉన్న మహిళల వద్ద అధికారుల చర్యలు అనుచితమని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలన్నారు.