News February 4, 2025
HYDలో ట్రాఫిక్ రద్దీ.. ముందుకు కదలని బండి..!

మహానగరంలో రద్దీ వేళల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే దాదాపు 32 నిమిషాల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ సంస్థ టామ్ టామ్ వెల్లడించింది. SMTI ట్రాఫిక్ సర్వే నిర్వహించి ఈ విషయాలను వివరించింది. HYDకు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు వచ్చినట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోనూ ఈ సర్వే చేపట్టింది. సర్వే రిపోర్టును బట్టి HYDలో రద్దీ సమయాల్లో బండి గంటకు 19KM వేగానికి మించట్లేదు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

జూబ్లీహిల్స్లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.
News November 14, 2025
Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT
News November 14, 2025
గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.


