News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News March 14, 2025
గుడిహత్నూర్లో యువకుడి సూసైడ్

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
News March 14, 2025
వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు.
News March 14, 2025
సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.