News February 4, 2025
పతకాలు సాధించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు

తెలంగాణ స్పోర్ట్స్ మీట్-2025లో పోలీస్ సిబ్బంది 14 పతకాలు సాధించినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. కరీంనగర్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు 3వ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ జరిగాయని అన్నారు. సోమవారం తన కార్యాలయంలో సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలన్నారు.
Similar News
News January 13, 2026
ప్రభాస్ నన్ను వర్రీ కావద్దన్నారు: మారుతి

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.


