News February 4, 2025

ఎల్లారెడ్డిపేట: చెట్టుకు ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కిష్టా నాయక్ తండాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. సురేశ్(36) కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, యువకుడు ఆత్మహత్య చేసుకొని 4రోజులు గడిచి ఉండొచ్చని సమాచారం. దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 24, 2025

చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

image

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.

News December 24, 2025

ఇయర్ బడ్స్‌ను క్లీన్ చేస్తున్నారా? లేదంటే..

image

రోజూ వాడే ఇయర్ బడ్స్ చూడటానికి క్లీన్‌గానే అనిపిస్తాయి. కానీ వాటిలో కిచెన్ సింక్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని సరిగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు, రాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వాక్స్ పేరుకుపోయి వినికిడి సమస్యలు రావచ్చు. నెలకు ఒక్కసారైనా సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్‌తో బడ్స్‌ను తుడవాలి. నీళ్లతో కడగొద్దు. అవి శుభ్రంగా ఉంటే హెల్త్ సేఫ్‌గా ఉండటంతో పాటు డివైజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

News December 24, 2025

పల్లవ రాణి కానుక ‘భోగ శ్రీనివాస మూర్తి’

image

క్రీ.శ.614లో శ్రీవారి పరమ భక్తురాలైన పల్లవ మహారాణి శ్యామమ్మ(కడవన్ పెరుందేవి) ఆయనకు ప్రతిరూపంగా ‘మనవాల పెరుమాళ్’ అనే వెండి భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని సమర్పించారు. ఏటా పెరటాసి(కన్యామాసం) బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించే సంప్రదాయాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాలయంలోని మూలవిరాట్టు తరపున నిత్య కైంకర్యాలన్నీ నేటికీ ఈ భోగ శ్రీనివాస మూర్తికే నిర్వహిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>