News February 4, 2025

నిర్మల్: ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. నర్సాపూర్ జి పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు రావటంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News January 9, 2026

WGL: సంక్రాంతికి 650 ప్రత్యేక బస్సులు

image

పండుగ పూట ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ రీజియన్ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9 నుంచి 13 వరకు HYDలోని ఉప్పల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 650 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RM వెల్లడించారు. తిరుగు ప్రయాణం కోసం 16 నుంచి 20 వరకు హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ సహా ప్రధాన డిపోల నుంచి సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News January 9, 2026

394 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 9, 2026

తిరుపతి: చిన్న అజాగ్రత్త.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంది!

image

చంద్రగిరి(M) కందులవారిపల్లెలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీడీ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపై పడటంతో మంటలు చెలరేగి, పాదిరి కేశవుల రెడ్డి అనే వృద్ధుడు గాయపడ్డారు. భార్య ఉన్నా ఆమె అనారోగ్యంతో మంచంపైనే ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. గ్రామస్థులు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు.