News March 19, 2024

MTM: చెత్త కుప్పలో హౌస్ ఫైల్.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

image

మచిలీపట్నంలో జర్నలిస్టుల హౌస్ సైట్స్‌కు సంబంధించిన, తీర్మాన ఫైల్ చెత్త<<12882516>> కుప్పలో దర్శనమివ్వడంపై<<>> జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ని ఆదేశించారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఫైల్ ఆన్‌లైన్‌లో బాగ్రత్తగా ఉంటుందని.. ఈ విషయంలో జర్నలిస్టులెవ్వరూ ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.

Similar News

News September 4, 2025

కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

image

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News September 4, 2025

కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

image

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.

News September 4, 2025

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

image

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.