News February 4, 2025

GWL: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 1, 2026

‘అబ్రహం లింకన్‌’ షిప్‌పై దాడి జరగలేదు: US

image

తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘అబ్రహం లింకన్‌’పై <<19274213>>దాడి<<>> జరిగిందన్న వార్తలను US సెంట్రల్ కమాండ్ ఖండించింది. దాడి చేశామని ఇరాన్ చెప్పిందంతా అబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘లింకన్‌ను ఏ మిస్సైల్ కూడా ఢీకొట్టలేదు. దాని దగ్గరగా కూడా చేరుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను తొలగించి అమెరికన్లను రక్షించేందుకు సెంట్రల్ కమాండ్‌తో కలిసి లింకన్ షిప్ విమానాలను ప్రయోగిస్తోంది’ అని స్పష్టం చేసింది.

News March 1, 2026

భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదు: బండి

image

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు మస్కట్ వరకు రోడ్డు మార్గం గుండా చేరుకుని స్వదేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవచ్చన్నారు.

News March 1, 2026

ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.