News February 4, 2025

బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

పాడి పశువుల్లో పాలజ్వరం – లక్షణాలు

image

ఈ వ్యాధి అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయకపోవడం, నెమరు వేయకపోవడం, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి.. S ఆకారంలో మగతగా పడుకొని ఉండటం పాల జ్వరంలో కనిపించే ప్రత్యేక లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది.

News September 15, 2025

పాడిపశువుల్లో పాలజ్వరం నివారణకు సూచనలు

image

పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్‌ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేతలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్‌, మునగ వంటి ఆకుల్ని కలపడం వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు. పశువులు ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్-డి ఇంజెక్షన్లు, ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు వెటర్నరీ నిపుణుల సూచనతో ఇవ్వాలి.

News September 15, 2025

KNR: గుడ్ న్యూస్.. వారంలో 5 రోజులు తిరుపతికి రైళ్లు

image

ఉమ్మడి కరీంనగర్ ప్రయాణికులకు వారంలో ఐదు రోజులపాటు తిరుపతికి వెళ్లేందుకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. KNR నుంచి తిరుపతికి ఆది, గురువారాల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మంగళవారం నాందేడ్ నుంచి తిరుచానూర్‌కు వీక్లీ స్పెషల్ రైలు తిరుపతి మీదుగా నడవనున్నాయి. శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం, శనివారం నాందేడ్ నుంచి తిరుపతి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు KNR, PDPL, జమ్మికుంట స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.