News February 4, 2025
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టు తిప్పాపురం రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడని స్థానికులు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఛత్తీస్గడ్ రాష్ట్రం జీడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు, తిప్పాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News March 20, 2026
‘భూములను చట్టబద్ధంగా తొలగించాలి’: బాపట్ల కలెక్టర్

22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి భూములను చట్టబద్ధంగా తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఇప్పటి వరకు 530 ఎకరాలు తొలగించామని చెప్పారు. 1,406 దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరో 876 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు.
News March 20, 2026
ఆదివాసీ గూడాలల్లో తాగునీటి బోర్లు, బావులు : మంత్రి సీతక్క

మిషన్ భగీరథ వ్యవస్థ అందుబాటులోకి రాని మారుమూల ఆదివాసీ గూడాలల్లో తక్షణమే మంచినీటి బావులు, బోర్లను నిర్మించాలని మంత్రి సీతక్క అన్నారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారంపై సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కుంటలను తవ్వించి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. పైప్ లైన్లకు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.
News March 20, 2026
KMR: నెలవంక దర్శనం.. రేపే ఈద్-ఉల్-ఫితర్

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా నెల రోజులుగా ముస్లింలు పాటిస్తున్న కఠిన ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి.


