News February 4, 2025

మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

image

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.

Similar News

News December 16, 2025

జాక్‌పాట్ కొట్టేదెవరో.. టీమ్‌ల వద్ద డబ్బులివే!

image

ఇవాళ అబుదాబిలో IPL మినీ వేలం జరగనుండగా ఈసారి ఏ ప్లేయర్ జాక్‌పాట్ కొడతారో అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏ జట్టు వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందో చూద్దాం. KKR(రూ.64.30కోట్లు), CSK(రూ.43.40కోట్లు), SRH (రూ.25.50కోట్లు), LSG (రూ.22.95కోట్లు), DC (రూ.21.80కోట్లు), RCB (రూ.16.40కోట్లు), RR (రూ.16.05కోట్లు), GT (రూ.12.90కోట్లు), PBKS(రూ.11.50కోట్లు), MI (రూ.2.75కోట్లు).

News December 16, 2025

ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికలగురించి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.

News December 16, 2025

ధనుర్మాసంలో శుభ కార్యాలు ఎందుకు చేయరు?

image

‘ధనుర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అందుకే వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు’ అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష నిపుణుల కథనం ప్రకారం.. ధనుర్మాసంలో సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు అలసి, విశ్రాంతి తీసుకుంటాయి. వాటి స్థానంలో గాడిదలు రథాన్ని లాగుతాయి. దీంతో సూర్యుని ప్రయాణం ఈ నెల రోజులు మందకొడిగా సాగుతుంది. అందుకే శుభకార్యాలకు ఈ సమయం మంచిది కాదని భావిస్తారు.