News February 4, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.

Similar News

News March 16, 2026

నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

image

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

News March 16, 2026

SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

image

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

News March 16, 2026

W.బెంగాల్.. 144 మంది అభ్యర్థులను ప్రకటించిన BJP

image

WB అసెంబ్లీ ఎన్నికల వేళ BJP 144 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారిని బరిలో దించింది. నందిగ్రామ్‌లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో APR 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు కేరళంలోనూ 47 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను BJP ప్రకటించింది.