News February 4, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే మంగళవారం పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. నేడు రూ.40 తగ్గి, రూ.6,960 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర తగ్గడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News September 15, 2025

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనగామ కలెక్టర్

image

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దిక్సూచి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దిక్సూచితో సమగ్రాభివృద్ధితో పాటు సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ద పెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అన్ని పాఠశాలలో అమలు చేస్తామన్నారు.

News September 15, 2025

HYD: ఏళ్లకేళ్లుగా సిటీలోనే తిష్ట!

image

నగరంలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 64 మందికి ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది. వారిని ఇక్కడి నుంచి బదిలీలు చేయడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చి.. ఇక్కడున్న వారిని జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లాల్లోని వారు కోరుతున్నారు. అయితే ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకొని ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 15, 2025

షాన్‌దార్ హైదరాబాద్.. ఇక పదిలం

image

HYD సంపద చారిత్రక కట్టడాలే. 12 వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లకు కూడా ఆహ్వానించింది. ఖైరతాబాద్ మసీదు, రొనాల్డ్ రాస్ భవనం, షేక్‌పేట మసీదు, చెన్నకేశవస్వామి గుడి, రేమండ్ సమాధి, హయత్‌బక్షిబేగం, పురానాపూల్ దర్వాజా, టోలి మసీదు, ఖజానా భవన్ (గోల్కొండ), షంషీర్ కోట, గన్‌ఫౌండ్రి, మసీదు ఇ మియన్ మిష్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.