News February 4, 2025

NGKL: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2026

తిరుపతిలో గరుడ వారధిపై ఇద్దరు యువకుల మృతి

image

బిహార్‌కు చెందిన ఉమేష్ కుమార్(35), తరుణ్(36) తిరుపతిలోని పవర్ టెక్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరూ స్కూటీపై వస్తూ గరుడ వారధిపై బ్లిస్ సర్కిల్ వద్ద డివైడర్ ఢీకొని రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉమేష్ కుమార్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ సోమవారం కన్నుమూశాడు. బంధువుల ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేశారు.

News March 17, 2026

బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.

News March 17, 2026

చీరాల: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు

image

చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. వేటపాలెం మండలానికి చెందిన 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పిట్ల సూరిబాబుకు న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5000ల జరిమానా విధించిందన్నారు. బాధితురాలికి రూ.75,000ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వివరించారు.