News March 19, 2024
కాకినాడ చరిత్రలో 1983లో అత్యధికం.. ఈ సారి ఛాన్స్ ఉందా.?

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?
Similar News
News September 5, 2025
రాజనగరం: నిత్య విద్యార్థిగా 8 డిగ్రీలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు

మండలంలోని వెలుగు బంధ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పవన్ కుమార్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2011 వరకు కానిస్టేబుల్ గా పనిచేసిన ఆయన ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న అభిమానంతో 2012లో నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టారు. విద్యార్థులతో మమేకమవ్వడమే కాకుండా తాను నిత్య విద్యార్థిగా ఇప్పటివరకు ఎనిమిది డిగ్రీ పట్టాలను అందుకున్నారు.
News September 4, 2025
రాజమండ్రి: ‘యూరియా నిల్వలు 2142 మెట్రిక్ టన్నులు’

తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 2142 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అవసరాల దృష్ట్యా అదనంగా సెప్టెంబర్ 5, 6 తేదీలలో యూరియాను అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 89779 35611లో సంప్రదించాలని సూచించారు.
News September 4, 2025
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఎస్పీ

రాజమండ్రి: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ కోరారు. ముస్లింలందరికీ “మిలాద్- ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవ జాతికి ఆదర్శమన్నారు. సామరస్యం, సోదరభావం , ఇతరుల పట్ల ప్రేమ ప్రవక్త చూపిన మార్గాలన్నారు.