News February 4, 2025

చింతపల్లిలో ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

చింతపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుర్ల విశ్వతేజ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్ వెనుక కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ వినోద్ బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో, పరీక్షలు రాసినా పాసవలేను అంటూ రాసిన లేఖ మృతదేహం వద్ద లభించిందని వారు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.

News September 18, 2025

గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.