News February 4, 2025
రోడ్డు ప్రమాదంలో లేడీ ఎస్సై మృతి
TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నారు.
Similar News
News February 4, 2025
బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలాన్లు చూసి పోలీసులు షాక్
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే, అలా చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. KA 05 JX 1344 రిజిస్ట్రేషన్ నంబర్తో వెళ్తోన్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా దానిపై 311 చలాన్లతో రూ.1.60లక్షల ఫైన్ గుర్తించారు. అతను హెల్మెట్ ధరించకపోవడం, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లాంటివి పదేపదే చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.
News February 4, 2025
సెహ్వాగ్, రిచర్డ్స్లాంటోడు అభిషేక్: హర్భజన్
టెస్టు క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, వీవీ రిచర్డ్స్ స్థానాలను టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన రెడ్ బాల్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇస్తారని జోస్యం చెప్పారు. ‘అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గణాంకాలు బాగా లేకున్నా ఇంగ్లండ్పై బాదిన శతకంతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.
News February 4, 2025
అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఇదే!
మార్కెట్లో ఎన్నో కంపెనీలు, మోడల్స్ వచ్చినా నోకియా 1100పై ఉన్న రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 100లో 30శాతం మంది చేతిలో ఐఫోన్స్ కనిపిస్తున్నాయి. కానీ, అత్యధికంగా అమ్ముడైన ఫోన్గా మాత్రం ఇది కాదు. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల ‘నోకియా 1100’ మొబైల్స్ అమ్ముడవడమే దీనికి కారణం. దీని తర్వాత నోకియా1110 (248M), iPhone 6/6 Plus (222M), నోకియా 105 (200M), iPhone 6S/ 6S Plus(174M) ఉన్నాయి.