News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News March 22, 2026
జిల్లాలో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ కసరత్తు

భద్రాద్రి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారు, ఎన్నికల ముందు చేరి గెలుపునకు కృషి చేసిన నేతల వివరాలను సేకరిస్తోంది. త్వరలోనే పదవుల ప్రకటన ఉండే అవకాశం ఉండటంతో అంతర్గతంగా వడపోత సాగిస్తోంది. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల ప్రయత్నాలు పెరిగాయి.
News March 22, 2026
JGTL: జీవన్ రెడ్డి వెంట వెళ్లేదెవరు.. అనుచరుల రహస్య సమావేశాలు!

మాజీమంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఆయన అనుచర వర్గంతో వరుస చర్చలు జరుపుతున్నారు. అయితే 2 రోజులుగా జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు BRSకు, ఆ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్లీ అదే పార్టీలో చేరడంపై కొంత ఆలోచనలో పడ్డారు. దీనిపై కొందరిని అడిగితే ఇంకా తాము పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనడం కొసమెరుపుగా మారింది.
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.


