News February 4, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద <<15356057>>మహిళా ఎస్ఐ శ్వేత కారు..<<>> ఓ బైక్ ను ఢీకొట్టగా ఎస్ఐతో పాటు మరో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ యువకుడు మంచిర్యాల జిల్లాలోని ఓ బ్యాంకులో పని చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లక్షెట్టిపేట పట్టణంలోని DBS బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్యాల నరేశ్(26)  ఉదయం జాబ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు.

Similar News

News March 22, 2026

కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

image

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.

News March 22, 2026

KMR: చారిత్రక నేపథ్యం ఉన్న కౌలాస్ కోటను మీరు చూశారా..!

image

KMR జిల్లాలో చారిత్రక నేపథ్యం కలిగిన జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట ప్రాచుర్యం పొందింది. అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య, కొండల నడుమ చూడ చక్కని పర్యాటక ప్రదేశంగా విరసిల్లుతోంది. కాకతీయుల నుంచి మొదలుకొని నిజాం పాలకుల వరకు ఈ కోటను వినియోగించుకున్నారు. కోట చుట్టూ కలిగిన ప్రకృతి సౌందర్య దృశ్యాలు, కోట లోపల దేవాలయాలు, దర్గాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి విహారయాత్రకు ఇక్కడికి వస్తారు.

News March 22, 2026

బందరులో YCP ఫ్లెక్సీ చించివేత..!

image

బందరులోని 33వ డివిజన్ చింత చెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన YCP ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వైసీపీ మాజీ కార్పొరేటర్ అజ్గర్ డివిజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం పలు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.