News February 4, 2025
జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Similar News
News November 13, 2025
జనగామ: దందా ఎంపీవోలు.. భగ్గుమంటున్న కార్యదర్శులు..!

జనగామ జిల్లాలోని పలువురు మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో) దందాలకు పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రోహిబిషన్ ఫైల్స్, చేసిన పనులకు చెక్కులు జారీ చేసేందుకు చేతులు చాస్తున్నారు. గ్రామాల సందర్శనకు వచ్చినందుకు సైతం వారి వ్యక్తిగత కార్లలో పెట్రోల్కు సైతం పైసలు వసూల్ చేస్తున్న ఎంపీవోలపై కార్యదర్శులు భగ్గుమంటున్నారు.
News November 13, 2025
రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ల సలహాతో అథ్లెట్లు, బాడీబిల్డర్లు 3-4 గుడ్లు తినొచ్చు. గుండె జబ్బులు, అధిక ఎల్డీఎల్, డయాబెటీస్ ఉన్నవాళ్లు, ఆహారంలో సంతృప్త కొవ్వులు తీసుకునేవారు గుడ్లు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
News November 13, 2025
కల్వకుర్తి: చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలి- DEO

విద్యార్థులు ప్రాథమిక స్థాయినుండే చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి క్రీడలలో గెలుపొందిన విజేతలకు గురువారం సాయంత్రం బహుమతులను ప్రదానం చేశారు. కల్వకుర్తి ఎంజేపీ పాఠశాల విద్యార్థులకు ఛాంపియన్షిప్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి తదితరులున్నారు.


