News February 4, 2025
బషీరాబాద్లో దారుణ హత్య

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 7, 2026
టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

T20 WC ఫైనల్లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్లో 2023 ODI WC ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్కు మంచిదని అభిప్రాయపడ్డారు.
News March 7, 2026
మానుకోటలో రాజకీయ వేడి!

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయన్న ప్రచారంతో మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో రెండు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా, మరో ఆరు మండలాలు పక్క నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. పునర్విభజన జరిగితే కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది జరిగితే జిల్లాలో బీసీ, గిరిజన సామాజికవర్గాల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది.
News March 7, 2026
హనుమకొండ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసామని డీఈఓ వెంకట గిరిరాజ్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. 4 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, చీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లు 827 మంది విధులు నిర్వహిస్తారన్నారు. సెల్ ఫోన్లు అనుమతించబోమన్నారు.


