News February 4, 2025
వికారాబాద్ ప్రజలకు ALERT

ఇటీవల వాట్సాప్లో వస్తున్న APK లింకులను టచ్ చేయకూడదని పలు మండలాల ఎస్ఐలు సూచిస్తున్నారు. అయినప్పటికీ మొబైల్ ఫోన్లు తమ పిల్లలకు ఇవ్వడంతో APK లింకులను టచ్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. ఇప్పటికైనా వాట్సాప్ గ్రూపులో వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయకూడదని అనుమానం వస్తే పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
హైదరాబాద్లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 14, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం, కడపలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓర్వకల్లులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఇమేజ్ సెన్సార్ తయారీ యూనిట్ను స్థాపించనుంది.
News November 14, 2025
మేడారం జాతరకు 1680 ఆర్టీసీ బస్సులు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2026 జనవరి 28-31 వరకు జాతర జరుగనుండగా, రోడ్లు, వసతుల అభివృద్ధికి పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ రీజియన్ నుంచి మాత్రమే 1,680 బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాను తెలిపారు. భక్తుల రాకపోకలు సులభం చేయేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.


