News February 4, 2025

వర్గీకరణపై వాస్తవాలతో ముందుకెళ్లండి: వివేక్

image

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశంపై ఊహాజనితంగా కాకుండా వాస్తవాల ప్రాతిపదికన వెళ్లాలని కోరారు. తాము మాలల సమావేశం పెట్టుకుంటే తప్పేంటన్న ఆయన మాదిగలు, రెడ్లు, బీసీలు సమావేశాలు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ ఎందుకు పట్టుబట్టట్లేదని నిలదీశారు.

Similar News

News November 8, 2025

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.

News November 8, 2025

4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.

News November 8, 2025

OP పింపుల్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

image

జమ్మూకశ్మీర్ కుప్వారా(D) కెరాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుపై పక్కా సమాచారంతో ‘ఆపరేషన్ పింపుల్’ పేరుతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓచోట నక్కిన టెర్రరిస్టులను గుర్తించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారని, మరికొందరు ట్రాప్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.