News February 4, 2025

చారకొండ: బందోబస్తు మధ్య కూల్చివేతలు

image

చారకొండ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి నిర్మాణం కోసం గ్రామంలోని ఊరి మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను జేసిబీలతో ఇళ్లను తొలగించారు. తొలగింపు కార్యక్రమాన్ని తహశీల్దార్ సునీత, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ ఇసాక్ హుస్సేన్ కూల్చివేతలు పర్యవేక్షించారు.

Similar News

News October 16, 2025

జూబ్లీహిల్స్‌లో బై‘పోల్‌’ పరేషాన్!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.

News October 16, 2025

నంద్యాల ఎంపీని పలకరించిన మోదీ

image

శ్రీశైలం పర్యటనలో భాగంగా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి నంద్యాల ఎంపీ శబరి స్వాగతం పలికారు. ఎంపీ శబరిని మోదీకి సీఎం పరిచయం చేశారు. ‘ఆమె నాకు తెలుసు. చాలాసార్లు శ్రీశైలానికి రమ్మని ఆహ్వానించారు. శబరి వల్ల శ్రీశైలానికి నేను వచ్చా. శబరి మీకు నా ఆశీస్సులు ఉంటాయి’ అని మోదీ అన్నారు.

News October 16, 2025

50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

image

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.