News February 4, 2025

సిద్దిపేట కమిషనరేట్‌లో 544 అవగాహన కార్యక్రమాలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News March 21, 2026

ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

image

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.

News March 21, 2026

HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.

News March 21, 2026

అనంత: స్వగ్రామానికి మాజీ MLA భౌతికకాయం తరలింపు

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.