News February 4, 2025
బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం: తలసాని
TG: కులగణన సర్వే ద్వారా BCలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్లో 30 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ‘ఈ సర్వే ప్రకారం BC, SC, ST జనాభా తగ్గినట్లు కనిపిస్తోంది. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు. ఇలాంటివాటికి చట్టబద్ధత కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ: మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు
TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.
News February 4, 2025
ప్రధాని మోదీ అమెరికా షెడ్యూల్ ఖరారు?
నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఈ నెల 13న ట్రంప్తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోదీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
News February 4, 2025
ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జరిగేది ఇదే!
KBCలో రూ.5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గుర్తున్నాడా? 2011లో ఈయన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ, ఆయన విజయం కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్గా మారారు.