News February 4, 2025

అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం జరిగింది. పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ ఛైర్మన్‌గా కూన రవికుమార్‌లను నియమిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు.

Similar News

News November 5, 2025

సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు: రాజ్‌నాథ్ సింగ్

image

ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘సైన్యానిది ఒక్కటే మతం. అదే “సైన్యధర్మం”. దానికి ఇంకో మతం లేదు’ అని అన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ధైర్యసాహసాలతో దేశం తలెత్తుకొనేలా చేస్తోందన్నారు. కులమత రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.

News November 5, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

✦ రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
✦ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ.. సరిహద్దు మార్పులపై నివేదిక రెడీ చేయనున్న మంత్రులు.. NOV 10న క్యాబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనపై చర్చ.. మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు
✦ నకిలీ మద్యం కేసు CBIకి ఇవ్వాలంటూ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్.. 12వ తేదీకి విచారణ వాయిదా

News November 5, 2025

మరి ఎందుకు అప్పీల్ చేయలేదు.. రాహుల్‌కు ఈసీ కౌంటర్

image

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ<<>>జరిగిందని, అక్కడ 12.5% ఓట్లు నకిలీవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. హరియాణాలో ఓటర్ల లిస్టుకు వ్యతిరేకంగా ఎలాంటి అప్పీళ్లు దాఖలు కాలేదని తెలిపింది. రివిజన్ టైమ్‌లో మల్టిపుల్ ఓట్లను నివారించేందుకు కాంగ్రెస్ బూత్‌ లెవెల్ ఏజెంట్లు అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదని EC వర్గాలు ప్రశ్నించాయి.