News March 19, 2024

ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం..

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.

Similar News

News September 6, 2025

సీఎం చేతుల మీదుగా అరుణకు ఉత్తమ టీచర్ అవార్డు

image

పామిడిలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయ వృత్తిపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

News September 6, 2025

ఎస్‌కే యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్

image

ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈఫిల్ టెక్ సొల్యూషన్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది. 97 మంది విద్యార్థులు హాజరు కాగా, 65 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఫిల్ టెక్ సొల్యూషన్ డైరెక్టర్ కిశోర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News September 5, 2025

ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్న డాక్టర్ శారదా

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. విజయవాడలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అనంతపురం JNTU కెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శారదా ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈమె గతంలో JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఈమె యూనివర్సిటీ NSS సెల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు.