News February 4, 2025

నరసరావుపేట: అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

image

పేద కుటుంబాల వారు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్ల ద్వారా చదివించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. మంగళవారం పేద కుటుంబాలకు చెందిన వారికి మూడు చక్రాల రిక్షాలను అందజేశారు. పేదరికం నుంచి చదువు మాత్రమే బయటికి తీసుకువస్తుందన్నారు. చిన్నారులను చిత్తు కాగితాలు ఏరుకునేందుకు పంపవద్దని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత ఉన్నారు.

Similar News

News February 23, 2026

కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

News February 23, 2026

కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

News February 23, 2026

ఏలూరు జిల్లా కలెక్టర్ అసహనం

image

ఏలూరు జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రగతిపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 108 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టాలని నిర్దేశించారు. అయితే, వీటిలో ఇంకా 22 మరుగుదొడ్లు, 44 తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల పనులు కనీసం ప్రారంభించకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.