News February 4, 2025

నారాయణపేట: భార్య ఆత్మహత్య.. భర్తకు జైలు శిక్ష

image

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు శిక్ష పడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన మహేశ్‌కు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వెలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. అదనపు కట్నం తేవాలని వేధించడంతో 2023 మే 31న నారాయణపేట (M) సింగారం గ్రామానికి చెందిన భవాని ఉరేసుకుందని, ఆమె అన్న భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.

News September 18, 2025

గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.