News March 19, 2024

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు వసూళ్లకు తప్ప పాలించడానికి పనికిరారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. CM రేవంత్ గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Similar News

News March 16, 2026

నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

image

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.

News March 15, 2026

NLG: పల్లెల్లో ఇక ‘సౌర’ వెలుగులు..

image

సామాన్యుడి ఇంటిపై ఇక సౌర ఫలకలు మెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ’ పథకం ద్వారా గ్రామాల్లో ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిదశలో భాగంగా నల్గొండ జిల్లాలోని కనగల్, అనుముల, ముదిగొండ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

News March 15, 2026

నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

image

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.